ఇండియా పేరు ‘భారత్’ గా మార్పు?
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఇండియా పేరు ను ‘భారత్’ గా మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోందని ప్రచారం సాగుతోంది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెస్తుందని భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని, ఇండియా పేరు మార్చుతూ సభలో తీర్మానం ఆమోదించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి జి 20 ప్రతినిధులకు డిన్నర్ కోసం పంపిన అధికారిక ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది.
No comments:
Post a Comment