మెల్బోర్న్ ,అక్టోబర్ 27: టీ20 ప్రపంచకప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ లో భారత్ 56 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ ప్రపంచకప్లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.180 పరుగుల లక్ష్యానికి గానూ నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షమికి ఒక వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 53 పరుగులు చేయడం విశేషం. ఈ గెలుపు తో సూపర్ -12 స్టేజ్ గ్రూప్ -2లో టీమ్ఇండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే.. సెమీస్కు చేరుకొనేందుకు అవకాశాలు పెరుగుతాయి.
No comments:
Post a Comment