Thursday, October 27, 2022

నెదర్లాండ్స్ పై భారత్ గెలుపు: ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కీలకం

మెల్బోర్న్ ,అక్టోబర్ 27: ​టీ20 ప్రపంచకప్​లో భాగంగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్ లో భారత్ 56 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ ప్రపంచకప్​లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

180 పరుగుల లక్ష్యానికి గానూ నెదర్లాండ్స్​  నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, అర్షదీప్‌, అక్షర్ పటేల్‌, అశ్విన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షమికి ఒక వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్​ఇండియా రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులు చేయడం విశేషం. ఈ గెలుపు తో సూపర్ -12 స్టేజ్‌ గ్రూప్ -2లో టీమ్‌ఇండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సెమీస్‌కు చేరుకొనేందుకు అవకాశాలు పెరుగుతాయి.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...