Wednesday, October 12, 2022

సమ్మె విరమించిన వీఆర్ఏలు ..

హైదరాబాద్, అక్టోబర్ 12: సమస్యల పరిష్కారం కోరుతూ 80 రోజులుగా చేస్తున్న సమ్మె ను వీఆర్ఏలు విరమించారు. వీఆర్ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో సీఎస్ సోమేశ్‌ కుమార్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని , వచ్చే నెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక కోడ్ దృష్ట్యా వచ్చే నెల నిర్ణయిస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. వీఆర్ఏలు రేపట్నుంచి విధులకు హాజరవుతారని ట్రెసా అధ్యక్షుడు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...