న్యూఢిల్లీ, అక్టోబర్ 12: గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైన మందుల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయాలని డ్రగ్ కంట్రోల్ ఆదేశాలు జారీచేసింది. హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్నారుల మృతికి కారణమైన మందుల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయాలని డ్రగ్ కంట్రోల్ ఆదేశాలు జారీచేసింది. తనిఖీల సమయంలో సొనెపట్లోని మైడెన్కు చెందిన దగ్గుమందు తయారీ కేంద్రంలోని లోపాలను హరియాణా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంస్థకు చెందిన తయారీ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని దానిలో పేర్కొంది. ఈ నోటీసులపై మైడెన్ నవంబర్ 14లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment