Friday, October 28, 2022

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద బావి లో పడిన కారు: నలుగురి మృతి

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్‌ జిల్లా అన్నారం షరీఫ్‌ వచ్చి.. తిరిగి వెడుతుండగా మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా కారులో ఎక్కించుకున్నారు. కేసముద్రం బైపాస్‌ రోడ్డులో మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌తో పాటు ఇద్దరు కారులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన నలుగురు కారుతో సహా బావిలో పడిపోయారు. వారిలో ఇద్దరు మహిళలను వెలికి తీయగా ఒకరు మృతి చెందినట్లు గుర్తించారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు వ్యక్తులు కారులోనే చిక్కుకుని మరణించారు.. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...