Friday, October 28, 2022

దేశం లో పోలీసులందరికి ఒకేలా యూనిఫాం : మోదీ ప్రతిపాదన


న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేశారు. ఇది సూచన మాత్రమేనని.. రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. హరియాణాలోని సూరజ్​కుండ్​లో జరుగుతున్న రాష్ట్ర హోంమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.నేరాలను నియంత్రించేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలని మోదీ తెలిపారు. దేశ అంతర్గత భద్రత కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయడం కేంద్రం బాధ్యత అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి అయినప్పటికీ.. అవి దేశ ఐక్యత, సమగ్రతతో ముడిపడి ఉంటాయని ప్రధాని తెలిపారు.సైబర్ నేరాల నిర్వహణ వ్యవస్థ అభివృద్ధి, పోలీసు బలగాల ఆధునీకరణ, నేర న్యాయవ్యవస్థలో ఐటీ వాడకం పెంపు, భూ సరిహద్దు నిర్వహణ, తీర ప్రాంత భద్రత తదితర అంశాలపై ఈ సమావేశం లో చర్చించనున్నారు. అంతర్గత భద్రతకు మెరుగైన ప్రణాళిక, సమన్వయానికి జాతీయ విధానం తయారు చేయటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ పేర్కొన్నాయి. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...