హైదరాబాద్ , అక్టోబర్ 19: తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వదంతులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కొట్టిపారేశారు. ఊపిరి ఉన్నంత కాలం టి ఆర్ ఎస్ ను వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన.. తాను కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. సికింద్రాబాద్లో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నామని, సికింద్రాబాద్లో జూనియర్, డిగ్రీ కళాశాల, హైస్కూల్లో రూ.30 కోట్లతో విద్యార్థులకు అనువుగా నూతన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. మెట్టుగూడ, తుకారాం గేట్లో ఆర్యుబీ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.102 కోట్ల నిధులు మంజూరయ్యాయని, కళాశాలలు, వైద్యశాల ఏర్పాటుకు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని పద్మారావు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment