Wednesday, October 19, 2022

అసలు నాయకులే తక్కువ.. పైగా మునుగోడు ప్రచారం… బూర వెంట అందరూ ఢిల్లీ పోవాలా..

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఇటీవలే టి ఆర్ ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ లోని బి జి పి కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌, రాష్ట్ర బి జి పి వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్య గౌడ్‌తో పాటు పార్టీలోకి 16 మంది నేతలు చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, డీకే అరుణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన బూర నర్సయ్య.. కొందరి కోసం తెలంగాణ కాదు.. అందరి తెలంగాణ రావాలనేదే తన లక్ష్యమని తెలిపారు. ఒకపక్క మునుగోడు ఎన్నిక ప్రచారం సమయంలో రాష్ట్రంలో వెళ్ల మీద లెక్కించ దాగిన ఐదుగురు నేతలు పోలో మంటూ ఢిల్లీ లో నర్సయ్య గౌడ్ బి జె పి లో చేరిక 

కార్యక్రమానికి వెళ్ళడం విడ్డూరం. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...