Wednesday, October 19, 2022

అంగన్వాడీలపై జగన్ దృష్టి..

విజయవాడ, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్ లో నవంబర్​​ నుంచి అంగన్​వాడీల ద్వారా అందించే పౌష్టికాహార పంపిణీని ప్రత్యేక యాప్‌ల ద్వారా పర్యవేక్షించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకోసం అంగన్​వాడీలు, సూపర్​వైజర్లకు సెల్​ఫోన్ల పంపిణీని ఆయన బుధవారం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టికాహారం, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌ 1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్​కి అప్పగించాలని ఆదేశాలిచ్చారు. అంగన్‌వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్​ క్లినిక్స్‌, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సచివాలయం లోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయం మాత్రమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత అందించేలా తగిన ఆలోచనలు చేయాలన్నారు. అంగన్‌వాడీలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలకు రోజూ ఇచ్చే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టి పెట్టాలని ప్రతి అంగన్‌వాడీల్లో ఫ్రిడ్జ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...