మహబూబ్నగర్, అక్టోబర్ 28: దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా తమను కలసిన చేనేత రంగం ప్రతినిధులకు రాహుల్ ఈ హామీ ఇచ్చారు. జిల్లా లోని పోడు రైతు ప్రతినిధుల బృందం కూడా రాహుల్ ను కలసి తమ సమస్యలు తెలిపారు. ఇందిరా గాంధీ హయాంలో తమకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు రాహుల్కు ఫిర్యాదు చేశారు.అటవీ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు పరిష్కరించడంతో పాటు భూమి పట్టాలు అందజేసి శాశ్వతంగా హక్కులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
No comments:
Post a Comment