హైదరాబాద్ , అక్టోబర్ 20; ఒకే రోజు ఇద్దరు బీసీ నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి టి ఆర్ ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. వీరు ఇద్దరు తమ రాజీనామా లేఖలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పంపారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బి జె పి విఫలమైందని స్వామిగౌడ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బి జె పి వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని, అనేక ఆశయాలతో బి జె పి చేరినప్పటికీ దశాదిశ లేని నాయకత్వ ధోరణులు.. నిర్మాణాత్మక రాజకీయాలకు, తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలోనే అర్థమైందని అన్నారు. ప్రజాహితమైన పథకాలు, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనుకుంటున్న బి జె పి తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని శ్రవణ్ పేర్కొన్నారు.
Friday, October 21, 2022
మునుగోడు ఉపఎన్నికకు ముందు బి జి పి కి దెబ్బ: టి ఆర్ ఎస్ లోకి జంప్ అయిన స్వామిగౌడ్, దాసోజు
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment