బెంగళూరు, అక్టోబర్ 18: : సినీ బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించిన కాంతార.. కన్నడ చిత్రం అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ప్రకటించిన 'టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్' జాబితాలో కాంతార అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్ను రూపొందించింది. సోషల్ మీడియా లో ఆ వివరాలు పంచుకుంది.నంబర్ 1 స్థానం లో'కాంతార' ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్ (1987), 5లో అన్బే శివం (2003), 6లో గోల్మాల్ (1979), 7లో జై భీమ్, 8లో 777 చార్లీ, 9లో పరియెరుమ్ పెరుమాళ్ (2018), 10లో మణిచిత్రతజు (1993) నిలిచాయి.
No comments:
Post a Comment