Tuesday, October 18, 2022

అమరావతి రైతులకు రాహుల్ సంఘీభావం..

కర్నూలు, అక్టోబర్ 18: : కర్నూలు జిల్లాలో ప్రవేశించిన భారత్​ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. అమరావతి రాజధానిగా und ఉండేందుకు మద్దతు ఇవ్వాలని రాహుల్​ను కోరారు. తమ పాదయాత్రకు రాహుల్సంఘీభావం తెలిపారని, న్యాయ సహాయం చేస్తామని చెప్పారని,  వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్​ చెప్పినట్లు అమరావతి రైతులు తెలిపారు. కాగా, రాహుల్​గాంధీని పోలవరం నిర్వాసిత రైతులు కూడా కలిశారు. పోలవరం నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...