Wednesday, October 19, 2022

ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడతా: ఖర్గే

న్యూఢిల్లీ , అక్టోబర్ 19: : అక్టోబర్‌ 26న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌నేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా.. తాము కలిసికట్టుగా పోరాడతామని ఖర్గే తెలిపారు. రాజ్యాంగానికి ముప్పుగా పరిణమిల్లే వాటిని అడ్డుకుంటామని తెలిపారు.అధ్యక్ష ఫలితాలపై స్పందించిన శశిథరూర్‌.. ఈ విజయం ఖర్గేది కాదని యావత్‌ కాంగ్రెస్‌ పార్టీదని కొనియాడారు. ఈ ఎన్నికలు పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని అందించిందని తెలిపారు. బలమైన భారతదేశం కావాలంటే.. బలమైన కాంగ్రెస్​ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...