Tuesday, October 18, 2022

ఉగ్రవాదంపై సమష్టి పోరే శరణ్యం- మోదీ


న్యూఢిల్లీ , అక్టోబర్ 18: ఉగ్రవాదులు, అవినీతిపరులు, నేరస్థులకు అనుకూలమైన అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందుకోసం అంతర్జాతీయ సమాజం మరింత వేగవంతంగా, కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. దిల్లీలో ఇంటర్‌పోల్‌ 90వ జనరల్‌ సమావేశాలను ప్రారంభించారు. ఉగ్రవాదం, డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, వ్యవస్థీకృత నేరాలు మానవాళిని పీడిస్తున్న ప్రధాన సమస్యలని మోదీ అన్నారు. అవి ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదనీ వాటికి అన్ని దేశాల్లో గట్టి పునాదులు కలిగి ఉన్నాయన్నారు. ఆ నెట్వర్క్‌ను ఎదుర్కోడానికి స్థానికంగా తీసుకునే చర్యలు ఏమాత్రం సరిపోవని తెలిపారు. ఉగ్రవాదం లాంటి పెనుభూతాన్ని భూస్థాపితం చేయాలంటే దేశాలన్నీ ఏకతాటి పైకి రావాలని స్పష్టం చేశారు. ఇంటర్‌పోల్‌ 90వ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకునే మోదీ వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...