Tuesday, October 18, 2022

పొత్తు పొడుపు కు సంకేతమా…?

విజయవాడ, , అక్టోబర్ 18: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం విజయవాడ నొవాటెల్‌ హోటల్‌ లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​తో భేటీ అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఇరువురు నేతలు బహిరంగంగా కలవడం ఇదే ప్రథమం.  విశాఖలో పోలీసులు పవన్‌ కల్యాణ్​ పట్ల వ్యవహరించిన తీరు పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతోందని… బి జె పి తో పొత్తు ఉన్నా ఎందుకో కలిసి వెళ్లలేకపోతున్నామని పవన్‌ అన్నారు. రౌడీలు రాజ్యమేలుతుంటే తన ప్రజలను రక్షించుకోవడానికి తాను వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుందని పవన్​ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే చంద్రబాబు ఆయనను కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...