హైదరాబాద్, అక్టోబర్ 31; దేశంలో
బి జి పి , తెలంగాణా లో టి ఆర్ ఎస్ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్ర లో భాగంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద మీడియా తో మాట్లాడుతూ, కొందరు నేతలు ఎవరికి వారు తమది పెద్ద పార్టీ అని ఊహించుకుంటున్నారనీ , భారాస ను అంతర్జాతీయ పార్టీగా కూడా ప్రకటించు కోవచ్చని వ్యాఖ్యానించారు. తెరాసతో ఎలాంటి అవగాహన గానీ.. పొత్తు గానీ ఉండదని రాహుల్ స్పష్టం చేశారు.భాజపా విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నట్లు రాహుల్గాంధీ స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో.. రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరగనుందని, ఇది విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్యేనని తెలిపారు. ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని , కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు.
No comments:
Post a Comment