హైదరాబాద్, అక్టోబర్ 31; అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో రూ. 600 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని, ఈ విషయాన్ని ప్రకటించేందుకు సంతోషిస్తున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ పెట్టుబడి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరోక్షంగా చాలా మంది ఉపాధి లభించనుందని తెలిపారు.
No comments:
Post a Comment