Monday, October 31, 2022

కేబుల్ వంతెన కూలిన దుర్ఘటన లో మృతుల సంఖ్య 134 కి చేరిక: తొమ్మిది మంది అరెస్ట్

అహ్మదాబాద్ , అక్టోబర్ 30; గుజరాత్ మోర్బీలో కేబుల్ వంతెన కూలి 134 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.  అరెస్ట్ ఆయిన  వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరేవాకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ క్లర్క్స్, ఇద్దరు కాంట్రాక్టర్లు, ముగ్గరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు పరిశీలించనున్నట్లు గుజరాత్‌ సీఎంఓ వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...