Friday, October 28, 2022

మంత్రి జగదీష్ రెడ్డికి కోడ్ ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్, అక్టోబర్ 28: మంత్రి జగదీశ్​ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా - ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారని బి జె పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్నది. మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. శనివారం మూడు గంటల్లోపు వివరణ ఇవ్వాలని, వివరణ ఇవ్వకపోతే తగిన నిర్ణయం తీసుకుంటామని జగదీశ్​ రెడ్డికి ఈసీ స్పష్టం చేసింది.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...