Sunday, October 30, 2022

గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ కావద్దు: మునుగోడు కు కె సి ఆర్ పిలుపు

నల్గొండ, అక్టోబర్ 29; మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారు. ఎన్నికలు రాగానే లొల్లి మొదలవుతుంది. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ చేస్తారు.. విచిత్ర వేషధారులందరూ ఎన్నికలప్పుడు వస్తారు. ఎవరు ఏమి చెప్పినా నిజానిజాలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇల్లు కాలిపోతుంది.‘‘ అని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కే సి ఆర్ అన్నారు. కొందరు ఢిల్లీ దిల్లీ బ్రోకర్‌లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే.. మన ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు చేశారని కేసీఆర్‌ అన్నారు. 

‘‘ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది. దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా. రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు? ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి. ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపాకు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు ప్రధాని మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. కేంద్రానికి బుద్దిరావాలంటే చేనేత కుటుంబాలు భాజపాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు. చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి‘‘ అని అన్నారు.‘‘60 ఏళ్ల కింద చిన్న పొరపాటు జరిగితే 58 ఏళ్ల పాటు కొట్లాడినం. చివరికి చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే తప్ప తెలంగాణ రాలేదు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయకపోతే .. పెట్టుబడి దారులను మనమే ప్రోత్సహించినట్లవుతుంది. మా బలం, బలగం మీరే.. మీరే అండగా లేకపోతే ఎవరికోసం పోరాడాలి‘‘ అన్నారు. ‘‘తెలంగాణ మాదిరిగానే భారత్‌ను చేయాలని పుట్టుకొచ్చిందే బీఆర్‌ఎస్‌. భారతదేశ రాజకీయాలకు పునాదిరాయి వేసే అవకాశం మునుగోడుకే దక్కింది. ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టితో గెలిపించి ప్రోత్సహించాలి. మునుగోడును కడుపులో పెట్టుకుంటా. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది‘‘ అని హామీ ఇచ్చారు. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...