హైదరాబాద్, అక్టోబర్ 22; తెలంగాణలో ప్రవేశించిన భారత జోడో పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించిన మొదటి రోజు స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య, మహేష్కుమార్ గౌడ్ లకు గాయాలయ్యాయి. దీపావళి సందర్భంగా మూడు రోజులు పాదయాత్రకు రాహుల్ విరామం ఇవ్వనున్నారు. ఈనెల 27న మక్తల్ మండలం చందాపూర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 110 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. పాదయాత్రలో స్థానిక నేతలకు అవకాశం కల్పించడం, శిబిరాల వద్ద వారితో మాట్లాడించడం ద్వారా తృతీయ, ద్వితీయశ్రేణి నేతల్లో ఉత్సాహం నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment