అక్టోబర్ 22; వరల్డ్ కప్ టి 20 లో మెల్బోర్న్ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్పై భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. 160 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్ఇండియాను విరాట్ కోహ్లీ-హార్దిక్ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్కు శతక భాగస్వామ్యం జోడించారు.ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లో రాణించి చిరకాల ప్రత్యర్థిపై విజయాల పరంపర కొనసాగించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (82*) ఒంటి చేత్తో టీమ్ఇండియాను గెలిపించాడు. 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్ఇండియాను విరాట్ కోహ్లీ-హార్దిక్ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్కు శతక భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత పాండ్య ఔటవగా.. కోహ్లీ చివరి వరకూ క్రీజ్లో ఉండి జట్టు కు విజయం అందించాడు. దీంతో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లు హరిస్ రవుఫ్(2), నసీం షా(1) నవాజ్(2) వికెట్లు తీశారు. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తో వరల్డ్ కప్లో మొదటి సారి ఆడుతున్న టీమ్ ఇండియా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోవడం విశేషం. హార్దిక్ పాండ్యా 3, షమీ, భువనేశ్వర్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.
No comments:
Post a Comment