Sunday, October 23, 2022

మెరిసిన కోహ్లీ.. పాక్ పై గెలిచిన భారత్

అక్టోబర్ 22;   వరల్డ్ కప్ టి 20 లో మెల్‌బోర్న్‌ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్​పై భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. 160 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు.ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లో రాణించి చిరకాల ప్రత్యర్థిపై విజయాల పరంపర కొనసాగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (82*) ఒంటి చేత్తో టీమ్‌ఇండియాను గెలిపించాడు. 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత పాండ్య ఔటవగా.. కోహ్లీ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టు కు విజయం అందించాడు. దీంతో టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్​ బౌలర్లు హరిస్ రవుఫ్(2), నసీం షా(1) నవాజ్​(2) వికెట్లు తీశారు. భారత్ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, పాక్​ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​తో వరల్డ్​ కప్​​లో మొదటి సారి ఆడుతున్న టీమ్ ఇండియా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోవడం విశేషం. హార్దిక్​ పాండ్యా 3, షమీ, భువనేశ్వర్ చెరో ఒక వికెట్​ పడగొట్టారు.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...