లక్నో, అక్టోబర్ 22; ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీపావళి పర్వదిన సంబరాల్లో భాగంగా సరయు నది తీరాన దాదాపు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించారు. ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో, రాంలీలా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామచంద్రుడి మాటలు, ఆలోచనలు, పరిపాలన విలువలే 'సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్'కు ప్రేరణ అని మోదీ అన్నారు. మోదీ రామ జన్మభూమిలో రామ్లల్లాకు.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ మట్టి ప్రమిదను వెలిగించి హారతి ఇచ్చారు. రామ మందిర నిర్మాణ పనులను కూడా ప్రధాని పరిశీలించారు. అనంతరం రాముడికి మోదీ పట్టాభిషేకం చేశారు.
No comments:
Post a Comment