ముంబై ,అక్టోబర్ 18: : బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు గా భారత జట్టు మాజీ ప్లేయర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మంగళవారం ముంబయి తాజ్ హొటల్లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ పాలకవర్గానికి కూడా ఎన్నికలు జరిగిగాయి. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ లోన్ సాకి, కోశాధికారిగా ఆశీష్ షెలార్, ఐపీఎల్ ఛైర్మన్గా అరుణ్ సింగ్ ధూమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్గా ఖైరుల్ జమాల్ మజుందార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు విషయాలపై ఫోకస్ పెట్టబోతున్నట్టు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్ బిన్నీ తెలిపాడు. మొదటిది ప్లేయర్లకు గాయాలు కాకుండా.. రెండోది దేశంలోని పిచ్లపై అని చెప్పాడు. గాయాల కారణంగానే బుమ్రా వరల్డ్ కప్కు దూరమయ్యాడని పేర్కొన్నాడు.
No comments:
Post a Comment