Tuesday, October 18, 2022

బీసీసీఐకి కొత్త అధ్యక్షుడుగా రోజర్ బిన్నీ


ముంబై ,అక్టోబర్ 18: : బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు గా భారత జట్టు మాజీ ప్లేయర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మంగళవారం ముంబయి తాజ్​ హొటల్​లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ పాలకవర్గానికి కూడా ఎన్నికలు జరిగిగాయి. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్​ శుక్లా, కార్యదర్శిగా జై షా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ లోన్ సాకి, కోశాధికారిగా ఆశీష్​ షెలార్‌, ఐపీఎల్‌ ఛైర్మన్‌గా అరుణ్‌ సింగ్‌ ధూమాల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఖైరుల్‌ జమాల్‌ మజుందార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు విషయాలపై ఫోకస్​ పెట్టబోతున్నట్టు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్ బిన్నీ తెలిపాడు. మొదటిది ప్లేయర్లకు గాయాలు కాకుండా.. రెండోది దేశంలోని పిచ్​లపై అని చెప్పాడు. గాయాల కారణంగానే బుమ్రా వరల్డ్​ కప్​కు దూరమయ్యాడని పేర్కొన్నాడు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...