Monday, October 10, 2022

శివసేన చీలిక వర్గాలకు కొత్తపేర్లు....

న్యూఢిల్లీ, అక్టోబర్10; శివసేన చీలిక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం.  కొత్తపేర్లు, గుర్తులు కేటాయించింది ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 'కాగడా' గుర్తును కేటాయిస్తూ, 'శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే' పేరును ఠాక్రే వర్గానికి కేటాయించింది. కాగా, 'బాలాసాహెబంచి శివసేన' అన్న పేరును శిందే వర్గానికి కేటాయించిన ఈసీ. కొత్త ఎన్నికల గుర్తు ఎంచుకోవాలని ఆ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాలు కోరినట్లు 'త్రిశూలం', 'గద' గుర్తులను కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది. కాగా, శివసేన పేరు, గుర్తును స్తంభింపజేయడాన్ని ఛాలెంజ్​ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...