Monday, October 10, 2022

అమెరికాకు చెందిన ముగ్గురికి ‘ఆర్థిక ‘ నోబెల్..

న్యూఢిల్లీ, అక్టోబర్10; అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక నిపుణులకు ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమిని ప్రకటించారు. బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్​లకు  బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు గాను అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రకటనతో ఈ ఏడాది అన్ని రంగాల్లో నోబెల్ అవార్డుల విజేతలను ప్రకటించటం పూర్తయింది. పురస్కార గ్రహీతల విశ్లేషణలు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, బెయిలవుట్‌లను నివారించగల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయని నోబెల్‌ ప్రైజ్ కమిటీ ఛైర్మన్‌ టోర్ ఎల్లింగ్‌సెన్ చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...