Saturday, October 22, 2022

రామోజీ కుడిభుజం.. అట్లూరి రామమోహనరావు మృతి


హైదరాబాద్, అక్టోబర్ 22;    రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు కన్నుమూశారు. ఈనాడు పత్రిక ఉన్నతిలో, విస్తృతిలో ఆయనది ప్రత్యేక స్థానం. రామమోహనరావు భౌతికకాయానికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నివాళులు అర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన కు నివాళులు అర్పించారు. రామమోహనరావు 1974లో ఈనాడులో ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1992 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణ వ్యవహారాల్లోనూ... పాలుపంచుకున్నారు. 1995లో ఫిల్మ్ సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలం ఆ బాధ్యతల్లో కొనసాగారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...