మెల్ బోర్న్, అక్టోబర్ 29: ప్రపంచకప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా పై దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ (68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. రాహుల్ (9), రోహిత్ (15), కోహ్లీ (12), దీపక్ హుడా (0), హార్దిక్ (2), దినేశ్ కార్తీక్ (6), అశ్విన్(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్ 3, నోకియా 1 వికెట్ చొప్పున పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్ లో మ్యాచ్లో 12 పరుగులు సాధించిన కోహ్లీ.. జయవర్దనే తర్వాత వెయ్యి పరుగులు బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. 134 పరుగుల లక్ష్య చేధన లో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే క్వింటెన్ డికాక్ (1), బవుమా (10), రుస్సో (10 ) వికెట్లను కోల్పోయింది. మర్క్రమ్(52) , డేవిడ్ మిల్లర్ (51) భాగస్వామ్యంలో జట్టుకు 85 పరుగుల భారీ స్కోర్ను అందించారు.
Sunday, October 30, 2022
దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment