Wednesday, October 19, 2022

రూ. లక్ష దాటిన ఇంజినీరింగ్ ఫీజు

హైదరాబాద్, అక్టోబర్ 19: : బీటెక్ తో పాటు ఎంటెక్, ఎంబీయే, ఎంసీయే రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో బీటెక్ వార్షిక రుసుము లక్ష రూపాయలు దాటింది. కనీస రుసుము రూ.35వేల నుంచి రూ.45వేలకు చేరింది. ఎంటెక్​లో కనీస ఫీజు రూ. 57వేల రూపాయలు.. ఎంబీయే, ఎంసీయే కనీస రుసుము రూ.27వేలు అయింది. ఇంజినీరింగ్​ ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లు కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ.. మొదట భావించింది. కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి తాము కోరిన ఫీజులే వసూలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలతో టీఎస్ఏఎఫ్ఆర్సీ చర్చించి ఫీజులు ఖరారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ వార్షిక రుసుము లక్ష రూపాయలు దాటింది. ఇప్పటి వరకు కనీస రుసుము రూ.35వేల రూపాయలు ఉండగా.. దాన్ని రూ.45వేలకు ప్రభుత్వం పెంచింది. అత్యధికంగా ఎంజీఐటీలో లక్ష 60వేల రూపాయలు.. సీవీఆర్​లో లక్షన్నర, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీలో లక్ష 40వేల రూపాయల ఫీజును ఖరారు చేసింది. ఎన్ఆర్ఐ కోటాలో గరిష్ఠ ఫీజు 5వేల డాలర్లుగా నిర్ణయించింది. ప్రవేశాల సమయంలో సుమారు మూడున్నర వేల రూపాయలు.. ఎన్‌బీయే గుర్తింపు ఉంటే మరో 3వేల రూపాయలు అదనంగా చెల్లించాలి. ఎంటెక్, ఎంబీయే, ఎంసీయే ఫీజులను కూడా ప్రభుత్వం పెంచింది. ఎంటెక్ కనీస ఫీజు 57వేలు.. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక రుసుము 27వేలకు పెరిగింది. ఈ ఫీజులు మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. అయితే ఫీజు రీఎంబర్స్​మెంట్​ పెంపుపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...