హైదరాబాద్, అక్టోబర్ 17: హైదరాబాద్లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. నగరంలో డేటా సైన్స్, అడ్వాన్స్ డ్ అనలిటిక్స్ సంబంధిత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో రోచే ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సింప్సన్ ఇమ్మాన్యుయేల్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రోచే ఫార్మా తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను స్థాపించడానికి హైదరాబాద్ను ఎంచుకోవడం గర్వ కారణంగా ఉందన్నారు. సెంటర్లకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
No comments:
Post a Comment