Friday, October 14, 2022

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం

హైదరాబాద్, అక్టోబర్ 14: మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. బి జె పి అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి, టి ఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా, నేడు ఆఖరి రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి బంగారు గడ్డ నుంచి చండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో తరలివచ్చి రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు సమర్పించారు. స్రవంతి వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించనున్నాయి. ఇప్పటికే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాలకు చెందిన నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. విపక్షాలు సైతం అదే స్థాయిలో హడావిడి చేస్తున్నాయి. కీలక ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం మునుగోడులో కేంద్రీకృతమైంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...