హైదరాబాద్, అక్టోబర్ 14: దుకాణాలు, కంపెనీలు, సంస్థల్లో నిర్దేశిత షరతులకు లోబడి మహిళా ఉద్యోగులు కూడా రాత్రి పూట విధులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఈ నెల 17 నుంచి అమలు లోకి వస్తాయి. రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించవచ్చు. ఇందుకు మహిళా ఉద్యోగుల అంగీకారం తప్పనిసరి అని ఉత్తర్వు స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని.. వాటికి జీపీఎస్ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు రొటేషన్ విధానంలో అమలు చేయాలని.. కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు లైంగిక వేధింపుల నుంచి భద్రతా చర్యలు, కనీసం ఐదుగురు మహిళా ఉద్యోగులు విధుల్లో ఉండేలా చూడాలని పేర్కొంది. ప్రసవానికి ముందు, తర్వాత కనీసం 16 వారాల పాటు మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు అప్పగించరాదని స్పష్టం చేసింది. నిర్దేశించిన నిబంధనలను ఏ సంస్థ పాటించకపోయినా రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని, లేదా మహిళా ఉద్యోగులకు రాత్రి విధులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment