నల్గొండ, అక్టోబర్ 25: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆయా బృందాలు వారి ఇళ్లకు వెళ్లి ఓట్లు నమోదు చేశాయన్నారు. ఇంతవరకు 318 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారు.ఈనెల 27, 28న మరో దఫా పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఇప్పటివరకు 19 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 2.70 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ 94 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్ట్ చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఓటుహక్కు వినియోగించు కునేందుకు 11 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఈసీ అనుమతించింది. ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధిహామీ జాబ్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, బ్యాంకు పాసుపుస్తకం, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆర్జీఐ - ఎన్పీఆర్ ఇచ్చే స్మార్ట్ కార్డు, ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు ఇచ్చే గుర్తింపు కార్డులు ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment