లండన్ , అక్టోబర్ 25: బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్-3 ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కరోనా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం మూలాన దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బ్రిటన్ను బయటపడేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం, సమగ్రత ఉంటుందని స్పష్టం చేశారు. బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్ని నియమించిన రిషి.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరిమీ హంట్ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. భారత మూలాలు ఉన్న సుయోల్లా బ్రేవర్మన్ను తిరిగి హోం సెక్రటరీగా, అలాగే, గ్రాంట్ శాప్స్ను ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ సెక్రటరీగా నియమించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment