Monday, October 17, 2022

మునుగోడు బరిలో 47 మంది..

నల్గొండ, అక్టోబర్ 17: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు సోమవారంతో ముగిసింది. అక్టోబరు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అక్టోబరు 14న నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 83 మంది అభ్యర్థు్ల్లో 36 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 47 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...