Monday, October 17, 2022

​రైతులకు 1700 రకాల పంట విత్తనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పి ఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు.. 16 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.  దిల్లీలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 22కోట్ల మంది రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులతోపాటు 1700 రకాలైన విత్తనాలను అందించి పంట ఉత్పాదకతను పెంచనున్నట్లు మోదీ చెప్పారు. వ్యవసాయంలో నానో యూరియా ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, ఒక సీసా ద్రవరూప యూరియా ఒక బస్తా యూరియాతో సమానమని చెప్పారు. దేశవ్యాప్తంగా 600 కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 3,30 లక్షల విత్తన దుకాణాలు పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా మారనున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ వీక్లీ ఫెర్టిలైజర్ ఇ-మ్యాగజైన్ ఇండియన్ ఎడ్జ్‌ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఎరువుల బ్రాండ్లపై రైతులు భ్రమలు, అయోమయంలో ఉన్నారని.. ఇకపై దేశమంతా ఒకే బ్రాండ్‌లో ఎరువుల విక్రయాలు సాగుతాయని మోదీ తెలిపారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...