Saturday, October 15, 2022

పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌..

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ​అప్పుడే పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం.. ఈ విధానం అమలు చేస్తుండగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో గతేడాది నుంచి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు.. ఆధార్‌ ఇచ్చినప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్‌ నమోదు చేయకుండా పిల్లల ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. తర్వాత 5 నుంచి 15 ఏళ్ల మధ్య బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...