Saturday, January 2, 2021

బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు

న్యూఢిల్లీ,జనవరి. 2; బ్రిటన్​ నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది  యూకే నుంచి బయలుదేరడానికి 72 గంటల ముందు నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌గా తేలిన కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన అదే వరసలోని ప్రయాణికులు, అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్నవారికి సంస్థాగత క్వారంటైన్ తప్పనిసరి చేసింది.. జనవరి 8 నుంచి 30 మధ్యలో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చేవారికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.  ప్రయాణికులే పరీక్షలకయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...