Saturday, January 2, 2021

హైదరాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో ఏడు చోట్ల డ్రై రన్‌

హైదరాబాద్,జనవరి 2; తెలంగాణాలో  కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని ఏడు చోట్ల  శనివారం డ్రై రన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ జిల్లాలో తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రి ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో 25-30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్థులను చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది వాక్సినేటర్‌లు సిద్ధంగా ఉండగా రోజుకు 10 లక్షల డోస్‌లు ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వం  వద్ద ఉందని  మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...