Tuesday, November 24, 2015

గ్రేటరూ మాదే...కె.సి.ఆర్.

 హైదరాబాద్, నవంబర్ 25: గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలలోనూ , త్వరలో  నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికలోనూ కూడా  వరంగల్ ఉప ఎన్నిక ఫలితం పునరావృత్తమవుతుందని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్  కు అనూహ్యమైన రీతిలో విజయాన్ని అందించి వరంగల్‌ ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని కొనియాడారు. తెలంగాణవ్యాప్తంగా 17 ఎంపీ స్థానాల్లో ఇప్పటి వరకూ ఎవరికీ రానంత భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. వరంగల్‌ ఎన్నిక అపురూపమైనదని, ప్రభుత్వంపైనా, పార్టీపైనా ప్రజలు మరింత బాధ్యత మోపారని అన్నారు. అధికార పార్టీ గెలుపు సహజమేనన్న దానిపై స్పందిస్తూ మరి బిహార్‌, ఢిల్లీలోనూ బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.  ఇప్పటికైనా ప్రతి పక్షాలు బుద్ధి తెచ్చుకుని ప్రజల సమస్యలపై సహేతుకమైన, నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని హితవు పలికారు.  కాంట్రాక్టు ఉద్యోగులను రెండు నెలల్లోనే క్రమబద్ధీకరిస్తామని,  త్వరలోనే డీఎస్సీ ద్వారా 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.    

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...