న్యూఢిల్లీ, నవంబరు 25 విభజన హామీల్లో భాగంగా ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ నెల 23న ఈ నిధుల్ని మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఈ మొత్తంలో రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లు రెండు నెలల కిందటే కేంద్రం ప్రకటించింది. కానీ, ఆ నిధులు విడుదల కాలేదు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను చూడాల్సిన కేంద్ర జల వనరుల శాఖ రివైజ్డ్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి ఆర్థికశాఖకు పంపించింది. కానీ, పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాతనే నిధులు విడుదలయ్యే అవకాశ ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రివైజ్డ్ బడ్జెట్ ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం లభిస్తుందని, ఆ వెంటనే నిధులు విడుదల చేస్తామని వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment