Tuesday, November 24, 2015

ప్రసూతి సెలవు 12 వారాల నుంచి 26 వారాలకు పెంపు ..

న్యూఢిల్లీ, నవంబరు 24: ఉద్యోగినులకు ప్రస్తుతం ఇస్తున్న ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా సరగసీ ద్వారా పిల్లలను పొందే మహిళలకూ, దత్తత చేసుకునే ఉద్యోగినులకూ 12 వారాలపాటు మెటర్నటీ లీవ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  1961 నాటి ప్రసూతి చట్టంలో సవరణ తీసుకువచ్చేందుకు ఒక ముసాయిదాపై కార్మిక శాఖ కార్మిక సంఘాలు, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రస్తుత ప్రసూతి చట్టం ప్రకారం ఒక ఉద్యోగినికి డెలివరీ అంచనా తేదీకి ఆరు వారాల ముందు....ప్రసవానంతరం మరో ఆరు వారాలపాటు సెలవు మంజూరు చేస్తున్నారు. అయితే ఈ  సమావేశంలో నవమాసాలు మోసి సహజంగా కనే తల్లులకు మెటర్నటీ లీవ్‌ను పెంచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...