Thursday, November 12, 2015

అనర్హత పై తలసానికి హైకోర్ట్ నోటిస్ ..

హైదరాబాద్, నవంబర్ 12; టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ కు హైకోర్టు షాకిచ్చింది. మంత్రి పదవికి తలసాని అనర్హుడని ఆరోపిస్తూ తంగెళ్ల శివప్రసాదరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు, దీనిపై స్పందించాలని ఆదేశాలు జారీ చేస్తూ మంత్రికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు తలసానికి సూచించింది. ఇప్పటికే ఇదే విషయంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా బదులిస్తున్న మంత్రి తలసాని హైకోర్టు నోటీసులకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి...

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...