Thursday, November 12, 2015

థాంక్స్ చెప్పేందుకే బాబును కలిశా ...పవన్

విజయవాడ,నవంబర్ 12; నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను రాలేకపోయానని, అందుకు సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇవాళ వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అంతేగాక రాజధాని భూముల కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపినట్టు పవన్ చెప్పారు. విజయవాడలో సీఎంతో రెండు గంటల పాటు చర్చ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాజధానిలో పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వం దృష్టి మొత్తం రాజధానిపైనే కాకుండా మిగతా ప్రాంతాల వైపూ చూడాలని ప్రస్తావించానన్నారు. ఇందుకు స్పందించిన సీఎం... ఎవరినీ బలవంతపెట్టి భూమిని తీసుకోబోమని చెప్పారన్నారు. అందరితో చర్చించాలకే భూములు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు. ప్రధానంగా విశాఖ బాక్సైట్ తవ్వకాలపై ప్రధానంగా చర్చించామని పవన్ వెల్లడించారు. గనులపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా పునరాలోచించుకోవాలని చంద్రబాబుకు సూచించినట్టు పేర్కొన్నారు. గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని కోరానని, చర్చించిన తరువాతే బాక్సైట్ పై ముందుకెళతామని చంద్రబాబు చెప్పినట్టు వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రస్తావన వచ్చిందని, ప్రధాని నుంచి తుది ప్రకటన వచ్చాకే నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...