Tuesday, November 24, 2015

సగానికి పైగా మండలాలో కరువు ..

హైదరాబాద్,నవంబర్ 25:  రాష్ట్రంలో 231 మండలాలను  కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాలను ఆదుకోవటానికి తక్షణ సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు అందించాలని ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రం లోని కరువు పరిస్థితులపై ఈ మేరకు ఒక ప్రాథమిక నివేదికను అధికారులు కేంద్రానికి పంపించారు.   అదిలాబాద్, ఖమ్మం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలు పూర్తిగా కరువులోనే ఉన్నాయి.నిజామాబాద్ జిల్లాలోని 36 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.  రంగారెడ్డి జిల్లాలో మొత్తం 37 మండలాలకు 33 మండలాలు కరువులోనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 57 మండలాలకు 19 మండలాలు, నల్లగొండ జిల్లాలో 59 మండలాలకు 22 మండలాలు, వరంగల్ జిల్లాలో 51 మండలాలకుగాను 11 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...