Wednesday, November 25, 2015

యాగానికి బాబునూ పిలుస్తున్నా ..కె.సి.ఆర్.

హైదరాబాద్, నవంబర్ 25; టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి సమయం సమీపిస్తోంది. వచ్చే నెల 23న మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎరవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న చండీయాగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. సొంత ఖర్చులతోనే యాగం నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేసారు.  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎంను కూడా ఆహ్వానిస్తున్నానని  కేసీఆర్ ప్రకటించారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...