Sunday, November 8, 2015

రిజర్వేషన్ అస్త్రమే మహాకూటమికి కలసి వచ్చిందా ....

న్యూఢిల్లీ, నవంబర్ 8; వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లాలూ, నితీష్‌ల మహాకూటమి దెబ్బకు బీజేపీ నేతలు ఖంగు తిన్నారు. తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఎదురు చూసిన కమలనాథుల ఆశలు గల్లంతయ్యాయి. దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థను పునఃసమీక్షించాలని గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతోపాటు దాద్రీ ఘటన, ఆవు మాంసం, పప్పుల ధరలు, బీహార్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ, మత రాజకీయాలు, అసహనం వంటి అంశాలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను తీవ్రంగా దెబ్బ తీశాయని చెప్పక తప్పదు.  రిజర్వేషన్లను సమీక్షించాలని మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మహాకూటమి నేతలకు మహా అస్త్రంగా మారాయి.  దీన్ని లాలూ, నితీష్‌లు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసివేస్తుందనే విషయాన్ని వీరు ఓటర్లలో బాగా ప్రచారం చేసారు.స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చి రిజర్వేషన్లను రద్దు చేయబోమని  చెప్పినా ఓటర్లు మాత్రం మహాకూటమి వైపే మొగ్గు చూపారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...