Tuesday, November 10, 2015

మోడీ ని రావద్దంటున్న ఆవాజ్ యూకే...

లండన్, నవంబర్ 10: బిహార్‌లో బీజేపీ ఓటమితో ప్రధాని మోదీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఆయనను ఆకాశాన్నేత్తేసిన ఎన్నారైలు ఇప్పుడు విదేశీ పర్యటనకు రావద్దంటున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 12 నుంచి యూకేలో పర్యటించనున్నారు. బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్వీన్ ఎలిజబెత్ అతిథ్యం కూడా పొందే అవకాశముంది. అయితే బ్రిటన్ ఇండో అసోసియేషన్ అయిన అవాజ్ యూకే మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోదీ రావద్దంటూ యూకే పార్లమెంట్ వద్ద భారీ కటౌట్ ప్రదర్శించింది. అంతేకాదు ఆయనను నియంత హిట్లర్‌తో పోల్చింది. ఫ్లెక్సీని  గమనించిన అధికారులు వెంటనే దాన్ని తొలగించారు. అయితే తన ఆక్రోశాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లగక్కిన ఆవాజ్ యూకే,  2002 గుజరాత్ అల్లర్లకు మోదీనే కారణమని మండిపడింది.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...