Saturday, November 7, 2015

తొలి టెస్ట్ గెలిచాం ......

మొహాలి ,నవంబర్ 7; దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు లో భారత్‌ 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగుల ఆధిక్యంతో కలిపి భారత్‌ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 109 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో 5 రోజుల మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ విజయంతో 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.. జడేజా 5, అశ్విన్‌ 3 వికెట్లు తీసి సఫారీల పతనానికి కారణమయ్యారు. అమిత్‌ మిశ్రా, వరుణ్‌ ఆరోన్‌ చెరో వికెట్‌ తీశారు. 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...